రేపు బస్తీ దవాఖానాల ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-13T13:11:42+05:30 IST

రేపు బస్తీ దవాఖానాల ప్రారంభం

రేపు బస్తీ దవాఖానాల ప్రారంభం

హైదరాబాద్/ముషీరాబాద్‌(ఆంధ్రజ్యోతి): భోలక్‌పూర్‌ డివిజన్‌ గాంధీనగర్‌లోని కోదండరెడ్డి పార్కు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను శుక్రవారం ప్రారంభించనున్నట్టు కార్పొరేటర్‌ అఖిల్‌ అహ్మద్‌ తెలిపారు. బుధవారం గాంధీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమెహన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా  మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజరవుతారని ఆయన తెలిపారు. వారితోపాటు జిల్యా వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.     

రామంతాపూర్‌, హబ్సిగూడ డివిజన్ల పరిధిలో.. : రామంతాపూర్‌, హబ్సిగూడ డివిజన్ల పరిధిలోని శారదానగర్‌, రాంరెడ్డినగర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణాల్లో శుక్రవారం ఉదయం బస్తీ దవాఖానాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, జీహెచ్‌ఎంసీ తూర్పు జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి ప్రారంభిస్తారని ఉప్పల్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ అరుణకుమారి తెలిపారు. 

Updated Date - 2020-08-13T13:11:42+05:30 IST