బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
ABN , First Publish Date - 2021-08-19T22:55:37+05:30 IST
బాసరలోని ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను గురువారం అధికారులు
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను గురువారం అధికారులు విడుదల చేశారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 1,404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 5గురు సీట్లు సాధించారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో ఈ ఏడాది పాలీసెట్ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని విద్యార్థులను ఎంపిక చేశారు.