కృష్ణా బాస్కెట్‌బాల్‌ జట్టు విజయం

ABN , First Publish Date - 2022-06-30T07:18:08+05:30 IST

విశాఖపట్నం గీతం కళాశాలలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఏడో అంతర్‌ జిల్లాల బాస్కెట్‌ బాల్‌ పోటీలలో అనంతపురంపై కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించడం అభినందనీయమని న్యూ గుడివాడ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ మల్లిఖార్జునరావు బుధవారం చెప్పారు.

కృష్ణా బాస్కెట్‌బాల్‌ జట్టు విజయం

గుడివాడ టౌన్‌  : విశాఖపట్నం గీతం కళాశాలలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన  ఏడో అంతర్‌ జిల్లాల బాస్కెట్‌ బాల్‌ పోటీలలో అనంతపురంపై కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించడం అభినందనీయమని న్యూ గుడివాడ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ మల్లిఖార్జునరావు బుధవారం చెప్పారు.  అనంతపురం 33 పాయింట్లు సాధించగా, కృష్ణాజిల్లా 54 పాయింట్లుతో విజయ భేరి మోగించిందన్నారు. కృష్ణాజిల్లా జట్టులో గుడివాడ న్యూ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌కు చెందిన నలుగురు క్రీడాకారులు ఉండడం ప్రశంసనీయమని అసోసియేషన్‌ అధ్యక్షుడు పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి), ఉపాధ్యక్షుడు  ప్రశాంత్‌, జాయింట్‌ సెక్రటరీ గుత్తా తారక రాజేంద్రప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యార్లగడ్డ మురళీకృష్ణ క్రీడాకారులను అభినందించారు. 


Updated Date - 2022-06-30T07:18:08+05:30 IST