బాస్కెట్‌ బాల్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2022-08-15T06:26:59+05:30 IST

ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్‌ బాల్‌ సీనియర్‌ పురుష, మహిళా జట్ల ఎంపిక డీఏఆర్‌ కళాశాలలో నిర్వహించారు.

బాస్కెట్‌ బాల్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
బాస్కెట్‌ బాల్‌ ఉమ్మడి కృష్ణా జట్టుకు ఎన్నికైన మహిళల జట్టు

నూజివీడు టౌన్‌, ఆగస్టు 14: ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్‌ బాల్‌ సీనియర్‌ పురుష, మహిళా జట్ల ఎంపిక డీఏఆర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషుల జట్లకు విజయవాడకు చెందిన పి.ఇర్ఫాన్‌, ఎల్‌.లక్ష్మణ్‌కుమార్‌, జే.డి సరోజ్‌, బి.సిల్వన్‌ , జె.ఆకాష్‌, ఎమ్డీ ఇబ్రహీమ్‌, ఎన్‌. సాయిఅన్వేష్‌ ఎన్నిక కాగా, నూజివీడుకు చెందిన బి.అరుణ్‌, కె.శ్యామ్‌సుందర్‌ సింగ్‌, ఏ.సందీప్‌, ఎన్‌వీఎన్‌ శశాంక్‌, వి.రాహుల్‌ ఎంపికైనట్టు బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.ఎస్‌.సీ. బోస్‌ తెలిపారు. మహిళల విభాగంలో నూజివీడుకు చెందిన యు.నాగదుర్గ, వి.సాత్విక, ఎం.హిమబిందు, వి.వినీల, జి.భువనేశ్వరి, కె.అరుణశ్రీ, జి.మైథిలి, ఆర్‌.సంధ్య ఎంపిక కాగా విజయవాడకు చెందిన పి.రాజేశ్వరి, పి.భవాని, బి.గీతిక, తోటపల్లికి చెందిన జె.రమ్య  ఎన్నికయ్యారు. కాగా బాస్కెట్‌బాల్‌ ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ఎంపికైన వారిలో నూజివీడు విక్టోరియా టౌన్‌ హాల్‌కు చెందిన మహిళా క్రీడాకారులు ఏడుగురు ఉండటం విశేషం. వీరు ఈ నెల 18 నుంచి గుంటూరులో జరిగే  రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.  జిల్లా జట్టుకు ఎంపికైన శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థి వాకా రాహుల్‌ను కళాశాల డైరెక్టర్‌ జి.రవిబాబు,  చైర్మన్‌ మేడా మోహన్‌ రావు తదితరులు అభినందించారు.



Updated Date - 2022-08-15T06:26:59+05:30 IST