కోలుకుంటున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ABN , First Publish Date - 2022-07-16T13:44:17+05:30 IST
: తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.
నిర్మల్: తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిన్న ఫుడ్ పాయిజన్తో 100 మందికిపైగా విద్యార్థులు(Students) అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్ ఆసుపత్రిలో 60 మందికి చికిత్స అందింగా... నిజామాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 17 మంది, నవీపేటలో 12 మందికి చికిత్స అందజేశారు.
మరోవైపు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. సమగ్ర విచారణకు విద్యాశాఖ మంత్రి సబితా ఆదేశించారు. బాధిత విద్యార్థులను ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పరామర్శించారు. మెస్ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.