Basara వద్ద గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు
ABN , First Publish Date - 2022-05-14T17:31:56+05:30 IST
బాసర వద్ద గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
నిర్మల్: బాసర వద్ద గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మహారాష్ట్ర యువకులు... పుణ్యస్నానాలు చేస్తూ నీట మునిగారు. విషయం తెలిసిన వెంటనే ఈతగాళ్లు నదిలో గాలించి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు మహారాష్ట్రలోని అకోలకి చెందిన కిరణ్ (19), ప్రతీక్ (19)గా గుర్తించారు.