వ్యాక్సిన్ కోసం బారులు
ABN , First Publish Date - 2021-07-27T03:58:31+05:30 IST
కరోనా వల్ల జీవితాలు అతలాకుతలమై, ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు వ్యాక్సిన్ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు.
కరోనా వల్ల జీవితాలు అతలాకుతలమై, ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు వ్యాక్సిన్ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని పీహెచ్సీ ఎదుట తెల్లవారుజామునుంచే కొవిడ్ టీకా కోసం బారులు తీరుతున్నారు. అయితే ప్రతిరోజు 200 మందికే వ్యాక్సిన్ ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ నిత్యం వందలాది మంది తరలివస్తున్నారు. సోమవారం సుమారు 400 మంది పీహెచ్సీ కేంద్రానికి వచ్చారు. భౌతికదూరం మరిచి ఒకరినొకరు తోసుకుంటూ కేంద్రంలోకి వెళ్లారు.
- బెజ్జంకి, జూలై 26