గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చింది: పేర్ని నాని

ABN , First Publish Date - 2022-04-06T23:51:30+05:30 IST

పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్

గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చింది: పేర్ని నాని

విజయవాడ: పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్‌కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే 27 శాతం ఐఆర్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని పేర్ని నాని ప్రశ్నించారు. 


వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాలనకు రెవెన్యూ అవసరమన్నారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2019 నాటి అప్పల భారం ఇప్పటి ప్రభుత్వంపై పడుతోందని బుగ్గన తెలిపారు. 


పీఆర్సీ అమలు చేయగలగుతామనే సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేందుకు పార్టీలు వస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2022-04-06T23:51:30+05:30 IST