Bareilly: అతిథిగా ఇంటికి వచ్చిన వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు

ABN , First Publish Date - 2021-09-30T17:57:34+05:30 IST

అతిథిగా ఇంటికి వచ్చిన మామయ్యే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన...

Bareilly: అతిథిగా ఇంటికి వచ్చిన వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు

బరేలీ (ఉత్తరప్రదేశ్):అతిథిగా ఇంటికి వచ్చిన మామయ్యే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణంలో వెలుగుచూసింది. బరేలీ పట్టణంలో నివాసముంటున్న తన బంధువు ఇంటికి భార్య, కుమారుడితో కలిసి వచ్చిన మామయ్యే భోజనం చేసిన తర్వాత, ఆతిథ్యమిచ్చిన ఇంట్లోని 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.గర్భవతిగా ఉన్న భార్యతోపాటు కుమారుడిని తీసుకొని అతిథిగా వచ్చిన వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేయడం సంచలనం రేపింది. ఆతిథ్యమిచ్చిన బంధువు ఇంట్లోనే బాలికపైనే అత్యాచారం జరిపి, ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. మైనర్ బాలికకు తన ప్రైవేటు భాగంలో తీవ్ర నొప్పిగా ఉండటంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.


 నిందితుడు సమీప బంధువేనని, మామయ్య వరుస అవుతాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఆతిథ్యమిచ్చిన ఇంట్లో బాలికపై అత్యాచారం జరిపిన కీచకుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, బాధిత బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు. నిందితుడిని అరెస్టు చేశామని, నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-09-30T17:57:34+05:30 IST