అర్థరాత్రి పెట్రోల్‌బంక్‌లో యువకులపై ఎస్సై దాడి

ABN , First Publish Date - 2022-06-25T17:02:27+05:30 IST

జిల్లాలో చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో పెట్రోల్ బంక్‌లో యువకులపై ఎస్సై చేయి చేసుకున్నారు.

అర్థరాత్రి పెట్రోల్‌బంక్‌లో యువకులపై ఎస్సై దాడి

బాపట్ల: జిల్లాలో చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో పెట్రోల్ బంక్‌లో యువకులపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఓ కేసులో సీజ్ చేసిన కారులో పెట్రోల్ పోయించుకునేందుకు ఎస్సై బంక్‌కు వచ్చారు. అదే సమయంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న యువకులపై దాడికి పాల్పడ్డారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఎస్సై తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల కారును వాడుకోవటంతో పాటు అకారణంగా దాడి చేసిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 



Updated Date - 2022-06-25T17:02:27+05:30 IST