బంటుమిల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు 25 మంది ఎక్సెల్టెక్లో ఉద్యోగాలకు ఎంపిక
ABN , First Publish Date - 2022-07-07T06:00:14+05:30 IST
బహుళ జాతి సంస్థ ఎక్సెల్టెక్ నిర్వహించిన జాబ్ మేళాలో బంటుమిల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు 25 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జగన్మోహనరావు తెలిపారు.
బంటుమిల్లి : బహుళ జాతి సంస్థ ఎక్సెల్టెక్ నిర్వహించిన జాబ్ మేళాలో బంటుమిల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు 25 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జగన్మోహనరావు తెలిపారు. జాబ్ మేళాలో వంద మంది విద్యార్థులు పాల్గొనగా వివిధ సామర్థ్య పరీక్షల్లో ప్రతిభ చూపి 25 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ జగన్మోహనరావు, కళాశాల కో-ఆర్డినేటర్ హిమాలినీదేవి, వైస్ ప్రిన్సిపాల్ దేవ జయరాజు, అధ్యాపకులు వేదాంతం, ఆనంద్కుమార్, రామారావు, ప్రసాద్, జోత్ప్స సుచరి విద్యార్థులను అభినందించారు.