ఉదయం 9 నుంచే బ్యాంకులు

ABN , First Publish Date - 2021-05-06T09:16:05+05:30 IST

రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనిచేసే వేళలో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచే బ్యాంకులు పనిచేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ) కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ

ఉదయం 9 నుంచే బ్యాంకులు

కర్ఫ్యూ నుంచి పోర్టులకు మినహాయింపు: ప్రభుత్వం


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనిచేసే వేళలో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచే బ్యాంకులు పనిచేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ) కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుల బిజినెస్‌ సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంద ని, సాయంత్రం 4 గంటల వరకు అవి తమ పనిచేసుకోవచ్చని పేర్కొన్నా రు. కాగా, కర్ఫ్యూ నుంచి పోర్టులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెసలుబాటు ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-06T09:16:05+05:30 IST