కరోనాతో ఇద్దరు బ్యాంకు మేనేజర్ల మృతి

ABN , First Publish Date - 2021-05-07T04:21:17+05:30 IST

కరోనాతో గురువారం ఇద్దరు ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్లు మృతి చెందారు. నెల్లూరులోని కలెక్టరేట్‌ బ్రాంచీ మేనేజర్‌ కొత్తపల్లి హరినాగేశ్వరాచారి చెన్నైలో, నాయుడుపేట ఎస్‌బీఐ ఏడీబీ చీఫ్‌ మేనేజర్‌ డి. వెంకటసుబ్యయ్య నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కరోనాతో ఇద్దరు బ్యాంకు మేనేజర్ల మృతి
మృతి చెందిన నాయుడు పేట ఎస్బీఐ ఏడీబీ బ్రాంచీ చీఫ్‌ మేనేజర్‌ వెంకట సుబ్బయ్య

భయాందోళనలో ఉద్యోగులు

నెల్లూరు(హరనాథపురం), నాయుడుపేట మే 6 : కరోనాతో గురువారం ఇద్దరు ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్లు మృతి చెందారు. నెల్లూరులోని కలెక్టరేట్‌ బ్రాంచీ మేనేజర్‌ కొత్తపల్లి హరినాగేశ్వరాచారి చెన్నైలో, నాయుడుపేట ఎస్‌బీఐ ఏడీబీ చీఫ్‌ మేనేజర్‌ డి. వెంకటసుబ్యయ్య నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమర్థవంతమైన అధికారుల మృతితో ఎస్‌బీఐలో ఆందోళన మొదలైంది. ఎప్పుడూ నవ్వుతూ కళ్ల ముందు తిరిగే వారు ఇక లేరని తెలిసి ఉద్యోగులు ఆలోచనలో పడిపోయారు. వారిద్దరే కాక ఎస్‌బీఐలో పనిచేసే పలువురు కరోనాతో బాధపడుతూ చైన్నైలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  అధికారులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో  బాధితులు ఉండడంతో మిగతా ఉద్యోగులు భయపడుతున్నారు. కరోనా భయంతో ఎలా విధులు నిర్వర్తించాలని వారు  ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల వ్యాపార లావాదేవీల వేళలు మారుస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకున్నా ఆ సమయంలోనూ ఖాతాదారుల తాకిడి ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటసుబ్బయ్య, నాగేశ్వరాచారి మృతి తీరని లోటని ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ షేక్‌ సందానీబాషా,  ఉద్యోగ సంఘ నాయకులు ఎస్‌కే. మనోజ్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.



Updated Date - 2021-05-07T04:21:17+05:30 IST