కొవిడ్ వల్ల బ్యాంక్ శాఖ మూసివేత
ABN , First Publish Date - 2021-04-16T05:50:40+05:30 IST
శ్రీహరిపురం భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలోని సిబ్బంది కరోనా బారిన పడడంతో గురువారం నుంచి ఆ శాఖను మూసేశారు.
మల్కాపురం, ఏప్రిల్ 15 : శ్రీహరిపురం భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలోని సిబ్బంది కరోనా బారిన పడడంతో గురువారం నుంచి ఆ శాఖను మూసేశారు. ఈ మేరకు ఆ బ్యాంక్ షెట్టర్పై మూసివేతకు సంబంధించిన నోటీస్ అతికించారు. ఈ విషయం తెలియక వచ్చిన ఖాతాదారులు నిరాశతో వెనుతిరిగారు.