బంజారాహిల్స్ పీఎస్ నూతన సీఐగా నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2022-04-03T22:25:09+05:30 IST

బంజారాహిల్స్ పీఎస్ నూతన ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వరరావును నియమిస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

బంజారాహిల్స్ పీఎస్ నూతన సీఐగా నాగేశ్వరరావు

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ నూతన ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వరరావును నియమిస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వరరావు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు టీమ్ పబ్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు.నాగేశ్వరరావుపై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ వుంది. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును కూడా కొత్త సీఐ నాగేశ్వరరావు విచారించనున్నట్టు తెలిసింది.ఇప్పటికే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ శివచంద్ర సస్పెండ్ అయ్యారు.గతంలో శివచంద్రపై సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలు వున్నాయి. పబ్‌లపై నిఘా పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

Updated Date - 2022-04-03T22:25:09+05:30 IST