టాస్ గెలిచిన బెంగళూరు.. రెండు మార్పులతో బరిలోకి పంజాబ్

ABN , First Publish Date - 2020-09-25T00:45:06+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా మరికాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం

టాస్ గెలిచిన బెంగళూరు.. రెండు మార్పులతో బరిలోకి పంజాబ్

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా మరికాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన బెంగళూరు ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన బెంగళూరు నేటి మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా, ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం కారణంగా ఓటమి చవిచూసిన పంజాబ్.. గెలుపు కోసం గట్టి పట్టుదలగా ఉంది.


పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోర్డాన్, గౌతమ్‌లను పక్కన పెట్టి వారి స్థానాల్లో మురుగన్ అశ్విన్, జేమ్స్ నీషమ్‌లకు చోటిచ్చింది. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరైన సమయంలో జట్టులోకి వస్తాడని కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

Updated Date - 2020-09-25T00:45:06+05:30 IST