2 కోట్ల పరువు నష్టం చెల్లించండి

ABN , First Publish Date - 2021-06-23T09:20:09+05:30 IST

ఓ రహదారి నిర్మాణ కంపెనీపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయడంలో విఫలవ్వడంతో మాజీ ప్రధాని దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు రూ.2కోట్లు చెల్లించాలని ఆదేశించింది

2 కోట్ల పరువు నష్టం చెల్లించండి

దేవెగౌడకు బెంగళూరు కోర్టు ఆదేశం


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఓ రహదారి నిర్మాణ  కంపెనీపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయడంలో విఫలవ్వడంతో మాజీ ప్రధాని దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు రూ.2కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బెంగళూరు-మైసూరు మధ్య రహదారి నిర్మించేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ భూములు కొనుగోలు చేశారని, తద్వారా భారీ గా అక్రమాలకు పాల్పడ్డారని దేవెగౌడ ‘నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజస్‌’(నైస్‌)పై ఆరోపణలు చేశారు. దీంతో నైస్‌ కంపెనీ చైర్మన్‌, కర్ణాటక మక్కళ పక్ష రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, బీదర్‌ ఉత్తర మాజీ ఎమ్మెల్యే అశోక్‌ఖేణి 2012లో దేవెగౌడపై రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు. 

Updated Date - 2021-06-23T09:20:09+05:30 IST