సర్పంచ్‌లకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: Bandy Sanjay

ABN , First Publish Date - 2022-06-15T19:37:16+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సర్పంచ్‌లకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: Bandy Sanjay

Hyderabad: కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandy Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్‌లకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని అడిగితే సస్పెండ్‌ చేస్తున్నారన్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలు పెంచారని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో భూ నిర్వాసితుల రక్తం పారేలా చేశారని, హామీలపై నిలదీస్తే నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసులు ఇళ్ల మీద పడి దాడులు చేశారన్నారు. భూ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీటన్నింటిపై గవర్నర్‌ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశామని బండి సంజయ్‌ తెలిపారు.


బీజేపీ నేత వివేక్‌ మాట్లాడుతూ కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తెలంగాణలో కమీషన్ల కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వివేక్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-15T19:37:16+05:30 IST