సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-03-08T21:04:26+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు: బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కర్మన్‌ఘట్ హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోమాత రక్షకులపై దుండగులు దాడి చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం నెంబర్ వన్ ద్రోహి అని, యాగాలు ఎవరికోసం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-03-08T21:04:26+05:30 IST