డిమాండ్లు సాధించే వరకూ ఉద్యమం విరమించం: బండి శ్రీనివాస్

ABN , First Publish Date - 2022-01-25T22:59:11+05:30 IST

జిల్లాల్లో ఉద్యమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాన్ని మెరుగైన పీఆర్సీ మాత్రమే అడుగుతున్నామని చెప్పారు.

డిమాండ్లు సాధించే వరకూ ఉద్యమం విరమించం: బండి శ్రీనివాస్

అమరావతి: జిల్లాల్లో ఉద్యమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేత బండిశ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాన్ని మెరుగైన పీఆర్సీ మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కుటిల నీతిని తెలుసుకున్నామన్నారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఉండాలని చెప్పామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన తాయిలాలకు తాము మురిసిపోలేదన్నారు. ఉద్యోగులు ప్రత్యక్షంగా శాంతియుత ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిమాండ్లు సాధించే వరకూ ఉద్యమం విరమించమని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-25T22:59:11+05:30 IST