Bandi Sanjay.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..

ABN , First Publish Date - 2022-08-16T21:25:27+05:30 IST

వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..

జనగామ (Janagama): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama yatra) మంగళవారం నాటికి వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వేరు, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.)పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. పాదయాత్ర (Pada yatra)లో తెలుసుకున్న ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో రూపొందిస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై ఏబీఎన్ వేదికగా చర్చకు సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు.


కాగా బండి సంజయ్ మంగళవారం పాలకుర్తి మండలం, విస్నూర్ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, స్థానిక నేతలు పాల్గొన్నారు. విస్నూర్, లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి, కడవెండి వరకూ పాదయాత్ర సాగుతోంది. నిన్నటి ఘటనల నేపథ్యంలో పాదయాత్ర రూట్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-08-16T21:25:27+05:30 IST