బండి సంజయ్ అంటే తెలంగాణలో ఎవరికీ తెలియదు: గుత్తా
ABN , First Publish Date - 2022-01-10T01:11:18+05:30 IST
బీజేపీ నేత బండి సంజయ్ అంటే తెలంగాణలో ఎవరికీ తెలియదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.
నల్గొండ: బీజేపీ నేత బండి సంజయ్ అంటే తెలంగాణలో ఎవరికీ తెలియదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకే సంజయ్ను అరెస్ట్ చేశారని తెలిపారు. మధ్యప్రదేశ్, అసోం సీఎంలు సంజయ్ను పరామర్శించడమేంటి? అని ప్రశ్నించారు. దొడ్డిదారిన సీఎం అయిన చౌహాన్,.. స్కాంలకు పాల్పడ్డ బిశ్వశర్మల.. శ్రీరంగనీతులను తెలంగాణ ప్రజలు నమ్మరని గుత్తా సుఖేందర్ ఎద్దేవాచేశారు.