సంగారెడ్డి: టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఓ తుగ్లక్ పార్టీ, ఎంఐఎం ఓ తాలిబన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సెప్టెంబర్ 17ను నిర్వహించేలా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం రూ.లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్కు కొత్త సచివాలయం ఎందుకు? అని సంజయ్ ప్రశ్నించారు.