ఏప్రిల్ 14 నుంచి బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర

ABN , First Publish Date - 2022-02-28T23:42:44+05:30 IST

ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు.

ఏప్రిల్ 14 నుంచి బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర

హైదరాబాద్: ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు.పార్లమెంట్ సమావేశాలు ముగిశాక సంజయ్‌ ఈయాత్ర చేయనున్నారు. ఇప్పటికే 36 రోజులపాటు  మొదటి విడత పాదయాత్ర సాగింది.రెండో విడతలో 200 రోజులపాటు యాత్ర చేయాలని సంజయ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఐదు విడతలుగా బండి సంజయ్‌ పాదయాత్ర చేయనున్నారు.  కరోనా దృష్ట్యా  రెండో విడత యాత్ర ఆలస్యంగా ప్రారంభమవుతుందని బీజేపీ అధిష్ఠానం తెలిపింది. రెండో విడత యాత్రని మహబూబ్‌నగర్ నుంచి  ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2022-02-28T23:42:44+05:30 IST