TS News: నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర పున: ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-26T15:50:11+05:30 IST

జనగామ: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) నేటి నుంచి తన పాదయాత్రను పున: ప్రారంభిస్తున్నారు. జాఫర్ గఢ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. బండి సంజయ్

TS News: నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర పున: ప్రారంభం

జనగామ: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) నేటి నుంచి తన పాదయాత్రను పున: ప్రారంభిస్తున్నారు. జాఫర్ గఢ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో పాదయాత్ర నిలిపేయాలని పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ కోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మూడు రోజుల పాటు నిలిచిపోయిన పాదయాత్ర శుక్రవారం నుంచి పున:ప్రారంభమవుతుంది. ఈ రోజు  పాంనూర్, ఉప్పుగల్, కూనూర్, గర్మెపల్లి, నాగపురం మీదుగా  పాదయాత్ర కొనసాగుతుంది. రేపు భద్రకాళీ ఆలయం వరకు కొనసాగుతోంది. అనంతరం పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ  నిర్వహణకు  ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేనందున అనుమతి రద్దు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీనిపై కూడా బీజేపీ నాయకులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Updated Date - 2022-08-26T15:50:11+05:30 IST