ఎవరి కోసం బండి సంజయ్ పాదయాత్ర: భట్టి
ABN , First Publish Date - 2022-04-14T21:49:10+05:30 IST
ఎవరి కోసం బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: ఎవరి కోసం బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. పేదల అకౌంట్స్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర అంటూ మండిపడ్డారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా సంజయ్ చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.