Pada Yatra: బండి సంజయ్ పాదయాత్రకు నేడు బ్రేక్
ABN , First Publish Date - 2022-08-21T17:07:49+05:30 IST
బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రకు ఆదివారం బ్రేక్ ఇచ్చారు.
జనగామ (Janagama): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రకు ఆదివారం బ్రేక్ ఇచ్చారు. మునుగోడు (Munugodu)లో బీజేపీ బహిరంగ సభ (BJP Meeting) ఉన్న నేపథ్యంలో పాదయాత్రకు ఒక్కరోజు విరామం ఇచ్చారు. మరి కాసేపట్లో స్టేషన్ ఘనపూర్ మండలం, మీది కొండ నుంచి మునుగోడు సభకు బయలుదేరనున్నారు. సోమవారం నుంచి మళ్లీ మీది కొండ నుంచి బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.