Nagaraju కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ

ABN , First Publish Date - 2022-05-16T23:15:19+05:30 IST

ఇటీవల సరూర్‌నగర్‌లో హత్యకు గురైన నాగరాజు (Nagaraju) కుటుంబాన్ని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు

Nagaraju కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ

హైదరాబాద్: ఇటీవల సరూర్‌నగర్‌లో హత్యకు గురైన నాగరాజు (Nagaraju) కుటుంబాన్ని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇటీవల నాగరాజు కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పరామర్శించారు. ఈ కేసులో ఇద్దరే నిందితులున్నారని పోలీసులు అంటున్నారని విమర్శించారు. కానీ నాగరాజు భార్య అశ్రిన్ నలుగురు నిందితులు ఉన్నారని ఆమె చెప్పిందని రాజాసింగ్ తెలిపారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని రాజాసింగ్ హామీ ఇచ్చారు. పరువు హత్యలకు ఎవరైనా పాల్పడితే కఠినంగా శిక్షించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-16T23:15:19+05:30 IST