కేసీఆర్ డొల్లతనం బయటపడింది: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-10-28T20:32:08+05:30 IST

కేసీఆర్ డొల్లతనం బయటపడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం గురించి ప్రశ్నిస్తే పారబాయిల్డ్ రైస్ లేఖను టీఆర్ఎస్ రిలీజ్ చేసిందన్నారు.

కేసీఆర్ డొల్లతనం బయటపడింది: బండి సంజయ్

హైదరాబాద్: కేసీఆర్ డొల్లతనం బయటపడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం గురించి ప్రశ్నిస్తే పారబాయిల్డ్ రైస్ లేఖను టీఆర్ఎస్ రిలీజ్ చేసిందన్నారు. ధాన్యం కొనమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను  రిలీజ్ చేశారని చెప్పారు. రైస్ ఎంత ఇచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కొందరు పారాబాయిల్డ్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయి కేసీఆర్ ఉప్పుడు బియ్యం కొనాల్సిందే అని కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతుకు, ఉప్పుడు బియ్యానికి సంబంధం లేదు అని మరోసారి గుర్తు చేశారని చెప్పారు.

Updated Date - 2021-10-28T20:32:08+05:30 IST