Telangana News: రేపటి నుంచి ‘పల్లె గోస-బీజేపీ భరోసా’
ABN , First Publish Date - 2022-07-21T00:13:39+05:30 IST
గురువారం నుంచి పల్లె గోస-బీజేపీ భరోసా (Palle Gosa-BJP Bharosa) కార్యక్రమాన్ని కమలనాథులు చేపట్టనున్నారు.
హైదరాబాద్: గురువారం నుంచి పల్లె గోస-బీజేపీ భరోసా (Palle Gosa-BJP Bharosa) కార్యక్రమాన్ని కమలనాథులు చేపట్టనున్నారు. తొలి విడతలో 6 నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో బైక్లపై తిరుగుతూ ప్రజలతో కమలనాథులు మమేకం కానున్నారు. పది రోజుల పాటు గ్రామాల్లోనే బీజేపీ నేతలు బస చేయనున్నారు. సిద్ధిపేట, వేములవాడ బైక్ ర్యాలీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొంటారు.