ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష..ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-02-03T02:45:56+05:30 IST

బీజేపీ ఎంపీలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి

ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష..ఏర్పాట్లు పూర్తి

ఢిల్లీ: బీజేపీ ఎంపీలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో గురువారం మౌన దీక్ష చేయనున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  సంజయ్ కుమార్  గురువారం మౌన దీక్షకు సిద్ధమయ్యారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంసహా పలువురు పార్టీ నేతలతో కలిసి ఆయన దీక్ష చేయనున్నారు. ఉదయం 11 నుంచి రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-02-03T02:45:56+05:30 IST