Bandi Sanjayపై KTR పరువు నష్టం దావా
ABN , First Publish Date - 2022-05-13T22:35:41+05:30 IST
ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ (KTR) పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు పంపారు.
హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ (KTR) పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విటర్లో కేటీఆర్పై బండి సంజయ్ (Bandi Sanjay) నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులల్లో పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో కేటీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది అన్నారు.