ర్యాలీ లేకుండా నిరసనతో ముగించిన నడ్డా

ABN , First Publish Date - 2022-01-05T00:37:40+05:30 IST

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ర్యాలీ లేకుండా నిరసనతో ముగించిన నడ్డా

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ  నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని తరుణ్ ఛుగ్ డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీ లేదని కిషన్ రెడ్డి తెలిపారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించాక నడ్డా తదితరులు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద విలేకరులతో మాట్లాడిన నడ్డా... తన ప్రజాస్వామ్య హక్కులను ఎవ్వరూ హరించలేరని చెప్పారు. 





Updated Date - 2022-01-05T00:37:40+05:30 IST