చావడానికి సిద్ధం.. మరి కేసీఆర్ రెడీనా: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-01-27T23:45:52+05:30 IST
ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై ఈ నెల 25న ఆర్మూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఎంపీ అర్వింద్ను పరామర్శించేందుకు..
నిజామాబాద్: ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై ఈ నెల 25న ఆర్మూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఎంపీ అర్వింద్ను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ జిల్లా నందిపేట్కు వెళ్లారు. ఎంపీ అరవింద్ నివాసానికి వెళ్లి ఆర్మూర్ దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ చార్మినార్ గడ్డ మీద గర్జించిన పార్టీ మాది.. గీ ఆర్మూర్ ఒక లెక్కనా. సీఎంకు భయం మొదలైంది. మూడే కాలం ముంచుకొస్తే ఇలానే చేస్తారు. దాడులు ఎందుకు చేస్తున్నారో అర్థవ్వడంలేదు. ఈ మూర్ఖుడి పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి దాడులు చేయమని చెబితే శాంతి భద్రతలు ఏమవుతాయి. త్యాగాలకు వెనుకడుగు వేయం. దాడులు మాకు కొత్త కాదు. మీరేం త్యాగాలు చేశారు?. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ డిప్రెషన్లో దాడులు చేస్తున్నారు. ప్రజల కోసం మేము చావడానికైనా సిద్ధం.. మీరు కేసీఆర్ రెడీనా.’’ అని సవాల్ విసిరారు.