తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బండిసంజయ్

ABN , First Publish Date - 2022-01-25T02:45:35+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బండిసంజయ్

రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన  టీఆర్ఎస్ పార్టీ క్యాడర్‎ను కాపాడుకునేందుకే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నాడని చెప్పారు. 317 జీవోపై ఇప్పటికైనా కేసీఆర్ పునరాలోచించాలని సూచించారు. 


‘‘స్పౌజ్ బదిలీలకు, మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క జీవో కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తాం. ముందస్తు ఎన్నికలకు పోతామని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు ఎలా వెళతారు.’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-25T02:45:35+05:30 IST