ఉద్యమకారులకు గేట్లు క్లోజ్.. ద్రోహులకు విందులు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-09T03:49:57+05:30 IST

కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌ను కలవడంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతి భవన్ గేట్లు క్లోజ్ చేసిందని..

ఉద్యమకారులకు గేట్లు క్లోజ్.. ద్రోహులకు విందులు: బండి సంజయ్

హైదరాబాద్: కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌ను కలవడంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతి భవన్ గేట్లు బంద్ చేశారని, ఉద్యమ ద్రోహులకు విందులు ఇస్తున్నారని యన వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను, నాయకులనే కేసీఆర్ దగ్గర తీస్తున్నాడని విమర్శించారు. ఎంఐఎం, సిపిఎం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. ఎంఐఎం, సీపీఎం రెండు పార్టీలు తెలంగాణ రావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమ దృహులకే కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదే పదే ప్రస్తావించడం వల్లనే కొంతమందికి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారని తెలిపారు. ఇదే కేసీఆర్ పాలన అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని.. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2022-01-09T03:49:57+05:30 IST