అప్పుడు పాస్‌పోర్ట్ .. ఇప్పుడు బియ్యం దందా: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-04-11T22:10:42+05:30 IST

వడ్లు కొనకుంటే కేసీఆర్ గద్దె దిగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ అన్నారు.

అప్పుడు  పాస్‌పోర్ట్ .. ఇప్పుడు బియ్యం దందా: బండి సంజయ్‌

హైదరాబాద్: వడ్లు కొనకుంటే కేసీఆర్ గద్దె దిగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు  బండి సంజయ్‌ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వయసు మీద పడి సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లుల నుంచి..డైవర్ట్ చేసేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. కమీషన్లకు టీఆర్ఎస్ నేతలు బాగా రుచి మరిగారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక పాస్‌ పోర్ట్ బ్రోకర్ అని ఆరోపించారు. పత్తి, మిర్చి ధర పెరగడానికి కారణం కేంద్రమేనని స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసేవాళ్లకు.. సమన్వయ సమితుల బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. ఇసుక, పాస్‌పోర్ట్ దందాలు చేశారని , ఇప్పుడు బియ్యం దందా చేస్తున్నారని బండి సంజయ్‌ దెప్పిపోడిశారు. 

Updated Date - 2022-04-11T22:10:42+05:30 IST