BJP జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న Bandi
ABN , First Publish Date - 2022-06-20T18:00:24+05:30 IST
నగరంలోని నోవాటెల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం పరిశీలించారు.
హైదరాబాద్: నగరంలోని నోవాటెల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay), స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం పరిశీలించారు. జూలై 2,3,4 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సుమారు 350మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రతినిధుల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.