TS News: పాదయాత్రకు తాత్కాలిక విరామం.. నేడు ఢిల్లీకి బండి‌ సంజయ్

ABN , First Publish Date - 2022-08-05T13:48:20+05:30 IST

బండి‌ సంజయ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

TS News: పాదయాత్రకు తాత్కాలిక విరామం.. నేడు ఢిల్లీకి బండి‌ సంజయ్

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌ (Bandi Sanjay) పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ  పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం జేపీ నడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah)ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Rajagopal Reddy) చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం. రాజగోపాల్‌ను పార్టీలోకి ఢిల్లీలో చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా మునుగోడులో కాషాయ కండువా కప్పలా అనే దానిపై కూడా సమాలోచనలు జరపనున్నారు. అలాగే పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో వాస్తవ పరిస్థితులపై అమిత్ షా నివేదికలు తెప్పించుకున్నారు. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం  చేస్తోంది. 

Updated Date - 2022-08-05T13:48:20+05:30 IST