పార్టీ టికెట్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-12T21:55:30+05:30 IST

పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

పార్టీ  టికెట్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు,  వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారు.తిప్పుకున్న వారికీ.. తిరిగిన వారికీ ఇద్దరకీ టికెట్లు రావు.బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోజీ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారు.ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు.. బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరు. అధ్యక్షుడైప్పటికీ.. నా టికెట్ పై కూడా స్పష్టత లేదు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్నవారే టికెట్ రాలేదు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-12T21:55:30+05:30 IST