నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా?: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-07-06T15:54:53+05:30 IST

సీఎం కేసీఆర్‌(CM KCR)పై ట్విటర్(Twitter) వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.

నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా?: Bandi Sanjay

Hyderabad : సీఎం కేసీఆర్‌(CM KCR)పై ట్విటర్(Twitter) వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ మండిపడ్డారు. నువ్వు చేస్తానన్న బంగారు తెలంగాణ(Telangana) ఇదేనా? అని ప్రశ్నించారు. ‘‘పౌష్టికాహారం దేవుడెరుగు, పట్టెడన్నం పెట్టలేవు విద్యార్థులకు.. పురుగులతో నిండిన కూడా ( అన్నం) పిల్లలకు పెట్టేది? నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా? చిన్న పిల్లలని కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర ! మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర !!’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-06T15:54:53+05:30 IST