BJP మద్దతు వలనే Telangana రాష్ట్రం ఏర్పాటైంది: Bandi Sanjay
ABN , First Publish Date - 2022-07-03T21:24:25+05:30 IST
బీజేపీ మద్దతు వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) మద్దతు వలనే తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పాటు అయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ (DK Aruna) తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టారు. బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ (KCR) పాలన కొనసాగుతోందని ఫైర్ (Fire) అయ్యారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం క్యాబినెట్గా మారి అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందని, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.