Bandi Sanjay: అందుకే నా పాదయాత్రను అడ్డుకున్నారు...

ABN , First Publish Date - 2022-08-24T21:12:19+05:30 IST

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi Sanjay: అందుకే నా పాదయాత్రను అడ్డుకున్నారు...

హైదరాబాద్ (Hyderabad): ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏ వ్యక్తినో, వ్యవస్థనో రెచ్చగొట్టడానికి తాను పాదయాత్ర చేయడంలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam) నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. తన పాదయాత్రను అడ్డుకున్నారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత (Kavatha) పాత్ర ఉందని బండి సంజయ్‌ అన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రానికి ప్రమాదకరమని, ముఖ్యమంత్రి కుటుంబ పెట్టుబడులు లేని వ్యాపారాలు లేవన్నారు. 8 ఏళ్లలో కేసీఆర్ (CM KCR) కుటుంబం వేల కోట్లు సంపాదించిందని బండి సంజయ్‌ ఆరోపించారు.


హైదరాబాద్‌లో మతఘర్షణలు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. ఎంఐఎం (MIM)తో కలిసి మతఘర్షణలకు ముఖ్యమంత్రి పన్నాగం పన్నుతున్నారని, సీఎం కుటుంబమే శాంతి భద్రతలకు విఘాతంగా మారిందని విమర్శించారు. పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని, ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు. కేసీఆర్ తాత వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొడతామని బండి సంజయ్‌ అన్నారు.

Updated Date - 2022-08-24T21:12:19+05:30 IST