TS News: సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు?: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-08-01T17:02:12+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు.

TS News: సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు?: బండి సంజయ్

కరీంనగర్ (Karimnagar): ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ (Triple IT) విద్యార్థుల సమస్యలు సీఎంకు కనపడవా? అని నిలదీశారు. బాసర (Basara)లో కావాలనే ఫుడ్ పాయిజన్ (Food poisoning) చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) ఆ ఫుడ్ తింటదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీల్లో టీఆర్ఎస్ (TRS) నేతలకు పార్ట్‌నర్ షిప్ (Partner ship)ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎక్కువ అయ్యిందని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2022-08-01T17:02:12+05:30 IST