టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-03-20T00:15:31+05:30 IST

టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత: బండి సంజయ్

నల్గొండ: టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కేంద్రం నిధులను టీఆర్‌ఎస్ దారి మల్లిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నీరు గారుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్ల సామాన్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పాలన బీజేపీతోనే సాధ్యమనమన్నారు.  ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-20T00:15:31+05:30 IST