ప్రభుత్వమే నిందితులను కాపాడుతోంది: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-06-08T23:41:40+05:30 IST

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు.

ప్రభుత్వమే నిందితులను కాపాడుతోంది: బండి సంజయ్‌

హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండిసంజయ్ ఆరోపించారు. ఘటనపై ఆయన స్పందిస్తూ ప్లాన్ ప్రకారమే గ్యాంగ్‌రేప్ ఘటన జరిగిందని అన్నారు. రఘునందన్‌రావు, రాజాసింగ్, బీజేపీ కార్యకర్తలపై కేసులు అన్యాయం పెట్టడం అన్యాయమని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆదేశిస్తే తప్ప..పోలీసులు స్పందించలేని పరిస్థితి వుందన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే తెలంగాణలో అఘాయిత్యాలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కారు సీజ్ చేయడంలో కావాలనే పోలీసుల జాప్యం చేశారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి దోషులను కాపాడుతున్నాయని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-08T23:41:40+05:30 IST