సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శలు
ABN , First Publish Date - 2022-02-22T00:46:30+05:30 IST
సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తుకుడే గ్యాంగ్ని కేసీఆర్ ముంబై తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ది దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబమన్నారు. దేశ భద్రతను ప్రశ్నించిన వ్యక్తిని కేసీఆర్ వెంటేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. తుకుడే గ్యాంగ్ ఆశలు కలలుగానే మిగులుతాయన్నారు. ఢిల్లీకి వెళదామన్న కేసీఆర్ పిలుపుకి స్పందన కరువైందన్నారు. అభివృద్ధి జరగలేదు కాబట్టే మేడారం జాతరకు కేసీఆర్ ముఖం చాటేశారని చెప్పారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్నారు.