సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
ABN , First Publish Date - 2021-11-08T18:54:54+05:30 IST
సీఎం కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. రైతులను ఆగం చేసింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. రైతులను ఆగం చేసింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పెత్తనం ఏంటని అనేది కేసీఆరే.. మళ్లీ కేంద్రం ధాన్యం కొనడం లేదని అనేది కేసీఆరే అని పేర్కొన్నారు. కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమందితో కుమ్మక్కై కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.