బండి సంజయ్పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2021-03-07T16:29:21+05:30 IST
బండి సంజయ్పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. ఇక్కడి అభివృద్ది చూసి ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ను అవమానిస్తారా?, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడిని జైల్లో ఎలా పెడతారు? అని ఆయన ప్రశ్నించారు. లాభాలలో ఉన్న కంపెనీలను అదానీ, అంబానీలకు అమ్మినందుకు ప్రధాని మోదీని జైల్లో పెట్టాలన్నారు.