కేసీఆర్పై దాడులు చేసే రోజు వస్తుంది: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-06-24T00:06:03+05:30 IST
కేసీఆర్పై దాడులు చేసే రోజు వస్తుంది: బండి సంజయ్
హైదరాబాద్: ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ను బీజేపీ నేత బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస సీఎం డైరెక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్పై దాడులు చేసే రోజు వస్తుంది. కేసీఆర్ నీ పతనం మొదలైంది’’ అని వ్యాఖ్యానించారు.